ఫ్లిప్కార్ట్.. తాజాగా బస్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ప్రస్తుతానికి బెంగళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి చార్జీలు లేకుండా బస్ టికెట్ను బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.