రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్, అస్సాంలలో మూడు సెమీకండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గుజరాత్లోని దొలేరాలో రూ.91 వేల కోట్ల పెట్టుబడితో, సనంద్లో రూ.7,600 కోట్ల పెట్టుబడితో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అస్సాంలోని మోరిగావ్లో రూ.27 వేల కోట్లతో మరో యూనిట్ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.