గర్భవతికి మొబైల్ టార్చ్‌లైట్‌తో సిజేరియన్.. తల్లీబిడ్డ మృతి

51చూసినవారు
గర్భవతికి మొబైల్ టార్చ్‌లైట్‌తో సిజేరియన్.. తల్లీబిడ్డ మృతి
ముంబైలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సడెన్ గా కరెంట్ పోవడంతో చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో వైద్యులు చేసిన సిజేరియన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చీకటిలో సిజేరియన్ చేయడంతో తల్లీబిడ్డ మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్