ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈసీ అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని వారికోసం హోం ఓటింగ్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో హోం ఓటింగ్ కు అంతంతమాత్రంగానే స్పందన రావడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతంపైనా లెక్కలు వేస్తున్నారు అధికారులు.