మాజీ సీఎం OPSపై కేసు నమోదు

60చూసినవారు
మాజీ సీఎం OPSపై కేసు నమోదు
తమిళనాడు మాజీ సీఎం ఓ.పన్నీరు సెల్వం (OPS)పై తాజాగా కేసు నమోదు అయింది. రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పుదుకోట్టై జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లిన ఆయనకు కొందరు మహిళలు హారతి ఇచ్చారు. సంప్రదాయం ప్రకారం హారతి పళ్లెంలో OPS డబ్బులు వేశారు. ఎన్నికల వేళ డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో OPSపై అరంతంగి పోలీస్‌స్టేషన్‌లో FIR నమోదు అయింది.