బీజేపీ ఏ రాష్ట్రంలో ఓడితే అక్కడి అధికార పార్టీ నేతలపై కేసులు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

54చూసినవారు
బీజేపీ ఏ రాష్ట్రంలో ఓడితే అక్కడి అధికార పార్టీ నేతలపై కేసులు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఓడితే అక్కడి ముఖ్యమంత్రిపైన, అధికార పార్టీ నేతలపైన పోలీసులు కేసులు పెట్టి వేధిస్తారని విమర్శించారు. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వాన్ని, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు అదేవిధంగా వేధిస్తున్నదని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ ఇమేజ్‌ను దెబ్బ తీయాలని కుట్ర చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్