నీట్ లీకేజీపై సీబీఐ విచారణ: కేంద్రం

53చూసినవారు
నీట్ లీకేజీపై సీబీఐ విచారణ: కేంద్రం
నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని పేర్కొంది. కాగా మే 5న నీట్ పరీక్ష జరగ్గా మే 4నే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్