సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి. కాగా.. మ్యాచ్లకు బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్, రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.