మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో బాగంగా గుజరాత్ జెయింట్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాదించింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 12.3 ఓవర్లలోనే 110 పరుగులు చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆర్సిబి కెప్టెన్ స్మృతి మంధాన 43 పరుగులు, సబ్భినేని మేఘన (36*), ఎల్లీస్ పెర్రీ (23*) పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. స్మృతీ మంధాన సేనకు ఇది వరుసగా రెండో విజయం.