తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అలాగే రాష్ట్ర అధికార గీతంగా జయజయహే తెలంగాణను కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామన్న ఆయన.. త్వరలోనే మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గంలో ఆమోదించామన్నారు.