ప్రస్తుత, కొత్త మొబైల్ ఫోన్-ల్యాండ్ లైన్ నంబర్లకూ ఛార్జీ వసూలు చేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిని ట్రాయ్ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఫోన్ నంబర్లకు కస్టమర్ల నుంచి ఫీజులు విధించే ప్రణాళికేదీ లేదని స్పష్టం చేసింది. కేవలం నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించామని తెలిపింది.