ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన DC జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77) అర్థశతకంతో రాణించారు. MI బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీకుమార్, విఘ్నేశ్ పుత్తూర్ తలో వికెట్ తీశారు.