బసవతారకంలో క్యాన్సర్ రీసెర్చ్ కేంద్రం ప్రారంభం

81చూసినవారు
బసవతారకంలో క్యాన్సర్ రీసెర్చ్ కేంద్రం ప్రారంభం
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రత్యేక క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌ను హిందూపురం MLA బాలకృష్ణ ప్రారంభించారు. అమెరికాలోని ప్రవాసాంద్రులు సుద్నగుంట కళ్యాణి, ప్రసాద్ దంపతులు రూ.10 కోట్ల విరాళంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈ సెంటర్‌ను "కళ్యాణి-ప్రసాద్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్"గా నామకరణం చేశారు. క్యాన్సర్‌పై మరింత అధునాతన పరిశోధనలకు ఇది దోహదపడుతుందన్న బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్