రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం

50చూసినవారు
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌ పురోగతిపై చర్చించనున్నారు. అలాగే అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చకు తీసుకురానున్నారు. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అనుసంధానంపై మంత్రితో మాట్లాడనున్నారు. ఇక, మంగళవారం కూడా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్