ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:30 గంటలకు బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకుంటారు. గంటపాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేయగా డిశ్ఛార్జ్ అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.