తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ (వీడియో)

83చూసినవారు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ "సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభదినానికి ప్రజాకోణాన్ని జోడిస్తూ 'ప్రజా పాలన దినోత్సవం' గా జరపాలని నిర్ణయించినట్టు" చెప్పారు. అంతకుముందు అమర వీరులను స్మరిస్తూ గన్‌పార్క్ అమర వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్