పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్‌ఛార్జి మంత్రులతో సీఎం రేవంత్ భేటీ

57చూసినవారు
పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్‌ఛార్జి మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్‌ఛార్జి మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని సీఎం సూచించారు.

ట్యాగ్స్ :