ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం ఎన్నికలు ముగియడంతో ఛార్జీలను పెంచింది. దేశంలో టోల్ ఛార్జీలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా సవరిస్తున్నారు. సోమవారం నుండి దాదాపు 1,100 టోల్ ప్లాజాల వద్ద పెంచిన ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులపై భారం, నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగనున్నాయి. 2018-19లో టోల్ వసూళ్లు రూ.2,520 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.5,400 కోట్లకు పెరిగింది.