నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమీక్ష

71చూసినవారు
నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమీక్ష
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్