ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల జరగనున్నాయి. గురు, శుక్రవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా మే 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది.