ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్‌

626చూసినవారు
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్‌
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు.

ట్యాగ్స్ :