రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు.