ప్రస్తుతం రాజస్థాన్లో
కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఆ రాష్ట్రంలో ఈ సారి ప్రభుత్వం మారనుందని CNN-NEWS 18 సర్వే అంచనా వేసింది. మొత్తం 200 స్థానాలు ఉండగా ఓ అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో
బీజేపీ 111,
కాంగ్రెస్ 74, ఇతరులు 14 స్థానాలు కైవసం చేసుకుంటాయని పేర్కొంది. దీంతో పూర్తి మెజార్టీతో
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని వెల్లడించింది.