ఇందిరమ్మ ఇళ్లపై కమిటీలు ఏర్పాటు

51చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై కమిటీలు ఏర్పాటు
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపాలిటీ, గ్రామపంచాయితీల పరిధిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్, ఇద్దరు మహిళ సంఘాల సభ్యులు, గ్రామ అభివృద్ధికి పాటుపడే ముగ్గురు వ్యక్తులు, పంచాయతీ సెక్రటరీ కమిటీలో ఉంటారని పేర్కొంది. సభ్యులలో ఒకరు బీసీ, ఇద్దరు ఎస్సీ లేదా ఎస్టీ ఉండాలని తెలిపింది. రేపటి వరకు కమిటీలు పూర్తి చేయాలని అదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్