మాతృభాషలో రాయలేకపోయిన కేంద్రమంత్రిపై కాంగ్రెస్ విమర్శలు

63చూసినవారు
కేంద్రమహిశా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకుర్ 'భేటీ బచావో, భేటీ పడావో' పదాన్ని తప్పుగా రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'రాజ్యాంగ పదవుల్లో ఉండి, అతిపెద్ద మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూసుకుంటూ.. కనీసం మాతృభాషలో కూడా రాయలేకపోవడం శోచనీయం. అలాంటి వ్యక్తి తన మంత్రిత్వ శాఖను ఎలా నిర్వహిస్తారో..?' అని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ విమర్శలను బీజేపీ ఖండించింది.