కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం

6500చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. 14 హామీలతో మహిళలకు పెద్దపీట వేసింది. మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ఇస్తామని ప్రకటించింది. మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం, మహిళా ఉద్యోగులకు వసతి గృహాలు కట్టిస్తామంది.