సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. వికారాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..
'సర్జికల్ స్ట్రైక్స్ గురించి రేవంత్ రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్లో ఉగ్రవాదులను ఏరిపారేశాం. కాంగ్రెస్ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ATMలా మార్చుకుంది. బీజేపీకి ఓటేస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తాం' అన్నారు.