దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ నగరమంతటా మట్టి కుండలను తలపై పెట్టుకుని నిరసనలు చేశారు. ఢిల్లీలోని మొత్తం 280 బ్లాకుల్లో ఉదయం 10 గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి. తలపై మట్టి కుండలతో, కాంగ్రెస్ జెండాలను చేతిలో పట్టుకుని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, అనంతరం కుండలను నేలపై పగులగొట్టారు.