రైతులు, పౌర సంస్థలు ప్రకటించిన ‘‘గ్రామీణ భారత్ బంద్’’కు కాంగ్రెస్ మద్దతునిస్తోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దేశంలోని 62 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం అబద్ధాలు, మోసం, అణచివేత, అన్యాయం తప్ప మరేమీ ఇవ్వలేదని ఖర్గే మండిపడ్డారు. కాగా.. రేపు రైతులు, పౌరసంస్థలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.