అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

578చూసినవారు
అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు స్వామికి క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. ఇక, ఉ. 7 గంటల నుంచి సా. 4 గంటల వరకు ఆదిత్యుడు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటలకు పవళింపు సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. గురువారం సాయంత్రం నుంచి భక్తులు అరసవల్లికి పోటెత్తారు.
Job Suitcase

Jobs near you