తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

74చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఈ మేరకు టికె­ట్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం అర్ధ­రాత్రి వరకు 82,406 మంది స్వామివారిని దర్శించుకోగా 31,151 మంది భక్తులు తలనీ­లాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమ­ర్పించా­రు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్