అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్‌

54చూసినవారు
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్‌
తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పూజా ఖేద్కర్‌ మీడియా ముందుకు వచ్చారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని ఆమె అన్నారు. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన ఈ ఐఏఎస్‌.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్‌ సర్వీస్‌లో చేరారనే ఆరోపణలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

సంబంధిత పోస్ట్