భార్య మాట విని.. రూ.25 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు!

52చూసినవారు
భార్య మాట విని.. రూ.25 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు!
మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్‌కు రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. దాంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతుంది. అల్తాఫ్ గత 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నాడు. ఈ ఏడాది స్నేహితుడి ద్వారా రెండు టికెట్లు (ఒక్కోటి రూ.500) కొనుగోలు చేశాడు. అయితే ఓ టికెట్‌ను స్నేహితుడికి ఇవ్వాలని అల్తాఫ్ అనుకుంటాడు. కానీ అతని భార్య అడ్డుపడింది. ఇప్పుడు అదే టికెట్ అల్తాఫ్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ టికెట్‌కే రూ.25 కోట్ల లాటరీ తగిలింది.

సంబంధిత పోస్ట్