నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానే జైలు నుంచి తాజాగా విడుదలయ్యాడు. బాలికపై అత్యాచారం కేసులో గతంలో అతడికి ఖాట్మండు జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. కింది కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశాడు. దీంతో అతడికి హైకోర్టులో ఉపశమనం దక్కింది. సందీప్ లామిచానెను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదలయ్యాక అతడికి మరో గుడ్ న్యూస్ అందింది. టీ20 ప్రపంచకప్ జట్టులో ఆయనకు చోటు దక్కింది.