కొన్ని శునక జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టేసింది. శునక జాతులపై నిషేధం విధించే ముందు సదరు శునకాల ఓనర్లతోపాటు అందుకు సంబంధించిన సంస్థల నిర్వాహకులను సంప్రదించి.. ఆ తర్వాత ఈ నిషేధం విధించారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పెంపుడు జంతువులు ఎవరినైనా గాయపరిచినా.. అందుకు బాధ్యత వహించాల్సింది వాటి యజమానులేనని.. వారికి నగదు చెల్లించాల్సి ఉందని ఈ సందర్బంగా హైకోర్టు స్పష్టం చేసింది.