మనీష్ సిసోడియాకు కస్టడీ పెరోల్

80చూసినవారు
మనీష్ సిసోడియాకు కస్టడీ పెరోల్
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాకు కస్టడీ పెరోల్ లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలుసుకునేందుకు వీలుగా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు కస్టడీ పెరోల్ ఇచ్చింది. మనీష్ సిసోడియా తన భార్యను చూసేందుకు వెళ్లినప్పుడల్లా ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలని కోర్టు ఆదేశించింది.