దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దయ్యాయి. కొద్దిసేపు రన్వే కార్యకలాపాలను సస్పెండ్ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. దారి మళ్లించిన విమానాలకు ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెడ్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.