సిగ్నల్, మార్గం మిస్‌మ్యాచ్‌ వల్లే ప్రమాదం

66చూసినవారు
సిగ్నల్, మార్గం మిస్‌మ్యాచ్‌ వల్లే ప్రమాదం
గత ఏడాది ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను మరువకముందే భాగమతి రైలు ప్రమాదం గురించి తెలియడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్‌ సింగ్‌ ఓ జాతీయమీడియాతో ఇవాళ మాట్లాడారు. సిగ్నల్‌, మార్గం మధ్య మిస్‌మ్యాచ్‌ ఈ ప్రమాదానికి కారణమైందన్నారు. మెయిన్‌ లైన్‌లోకి వెళ్లేలా సిగ్నల్‌ ఇవ్వగా.. ట్రాక్‌ మాత్రం రైలును క్లోజ్డ్‌ లూప్‌ వైపు మళ్లించిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్