ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను 5 రోజుల వరకు రిమాండ్ ఇవ్వాలని సీబీఐ కోరింది. విచారణలో భాగంగా ఢిల్లీ ట్రయల్ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతినిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.