మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చే రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటన సాయంత్రం 5.10 గంటలకు జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు. పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు.