లోక్ సభ ఎన్నికల బరిలో 'ఛత్రపతి శివాజీ' వారసులు

61చూసినవారు
లోక్ సభ ఎన్నికల బరిలో 'ఛత్రపతి శివాజీ' వారసులు
లోక్ సభ ఎన్నికల బరిలో మహారాష్ట్రలో ఈసారి ఇద్దరు ఛత్రపతి శివాజీ వారసులు నిలిచారు. కాంగ్రెస్ తరఫున కొల్హాపూర్ నియోజకవర్గంలో సాహూ ఛత్రపతి (76) పోటీ చేస్తున్నారు. ఇవి ఆయనకు తొలి ఎన్నికలు. సాహు శివాజీ వంశానికి చెందిన 12వ వారసుడు. మరోవైపు శివాజీకి చెందిన మరో వారసుడు ఉదయన్రాజే భోస్లే సతారా స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా సేవలు అందించారు.