విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మరికాసేపట్లో అమ్మవారికి తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనంతో పాటు సారె సమర్పించనున్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో దుర్గమ్మకు బంగారు బోనాన్ని కమిటీ సమర్పిస్తోంది.