భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. హరిత, శ్వేత, నీలి తదితర విప్లవాల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి. పంటల దిగుబడి అధికమైంది. అయితే, భారత్లో అన్నదాతల ఆదాయం మాత్రం పెరగలేదు. నేటికీ సరైన మద్దతు ధర కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.