విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన తమిళ్ దర్శకుడు వెట్రి దురైసామి కారు సట్లేజ్ నదిలో పడి అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సుమారు 9 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తప్పిపోయిన దర్శకుడు నది ఒడ్డుకు శవమై కొట్టుకు వచ్చాడు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి.