జీరో బిల్లుకు దూరం

1017చూసినవారు
జీరో బిల్లుకు దూరం
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకు అర్హుల ఎంపిక కోసం వార్డుల వారీగా ప్రజాపాలన వేదికలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో చాలావరకు జీరో బిల్లులు వస్తుండగా, ఇంకా కొందరికి జీరో విద్యుత్‌ బిల్లు రావడం లేదు. అన్ని అర్హతలున్నా.. దరఖాస్తు చేసుకున్నా విద్యుత్‌ బిల్లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.