ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో జరిగింది. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో పని చేసిన మహిళా ఉద్యోగిని పదవీ విరమణ చేసింది. దీంతో ఆమెకు వీడ్కోలు పలికేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.