బీహార్లోని పశ్చిమ చంపారన్లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ మైనర్ బాలికను అల్లావుద్దీన్ మియాన్, సఫ్దర్ మియాన్ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వదిలి పారిపోయారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాఫు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు డ్రగ్స్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.