భాండాగారం డూప్లికేట్ తాళపుచెవి కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉందని.. దాంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామని జస్టిస్ బిశ్వనాత్ రథ్ కమిటీ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పటిలోపు పూర్తి అవుతుందో అప్పుడే చెప్పలేం అంటోంది బిశ్వనాథ్ కమిటీ. నగల లెక్కింపు కంప్లీట్ అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ, నియమ నిష్టలతో ఉంటారు.