టైటిళ్లను డబుల్ చేస్తాం: విరాట్

580చూసినవారు
టైటిళ్లను డబుల్ చేస్తాం: విరాట్
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో ఆ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్‌ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్‌ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్‌ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్‌ గెలిచిన ఫీలింగ్‌ కలిగిందని తెలిపాడు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్