పెరుగు ఒంటికి చలవ చేయడమే కాదు.. మహిళలకు మరెన్నో రకాలుగానూ మేలూ చేస్తుందట. రోజూ పెరుగు తింటే.. శరీరానికి తగినంత కాల్షియం అంది ఎముకలు దృఢంగా మారతాయి. రోజూ పెరుగు తినడం వల్ల మెనోపాజ్ తరవాత మహిళలు అస్టియో పోరోసిస్ సమస్య బారిన పడకుండా ఉంటారు. పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు.. మంచి బ్యాక్టీరియాను వృద్ది చేసి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.