కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు

76చూసినవారు
కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందనే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌‌కు ఈడీ అధికారులు మ‌రోసారి స‌మ‌న్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని అధికారులు స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు. విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఆయ‌న‌కు ఇప్ప‌టికే 8 సార్లు స‌మ‌న్లు జారీచేసినా ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. దీంతో మరోసారి నోటీసులిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్